‘కల్కి’ టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్

నవతెలంగాణ – హైదరాబాద్: మరో రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సైన్స్ సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ థియేటర్లలోకి రాబోతోంది. నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 27వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్ బుకింగ్స్ షురూ అయ్యాయి. తెలంగాణలో ఈ సినిమా టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇక తాజాగా కల్కి సినిమా టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27వ తేదీ నుంచి రెండు వారాల పాటు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ నిర్మాత అశ్వనీదత్‌ చేసిన వినతికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర టికెట్‌పై సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 వరకు పెంచుకోవచ్చని పేర్కొంటూ .. రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.

Spread the love