- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రములోని గ్రామభివృద్ధి కమిటీ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా నూతన కమిటీ సభ్యులు ఆర్మూర్ రంజిత్ రెడ్డి కి 12 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. మొదటి నుండి గ్రామములో అభివృద్ధికి సహాయ సహకారాలు అందించే వేక్తిగా మంచి పేరు ఉన్న వ్యక్తి పేరు ఉన్న రంజిత్ కు ఆయా సంఘాల మద్దతుతో అత్యధిక సభ్యులు తమ ఓటును రంజిత్ కు వేసి గ్రామ అభివృద్ధి అధ్యక్షునిగా మద్దతు పలికి గెలిపించారు. అనంతరం గ్రామస్థులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



