నవతెలంగాణ – హైదరాబాద్: భారత ఆర్మీకి చెందిన ఓ చిన్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. ట్రైనింగ్ సెషన్లో ఉండగా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం బీహార్లోని గయ జిల్లాలో మైదానంలో ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు ట్రైనీ పైలట్లు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ)కి చెందిన మైక్రోలైట్ ఎయిర్క్రాఫ్ట్ మంగళవారం ఉదయం ట్రైనింగ్ సెషన్లో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో 9.15 గంటలకు పహార్పూర్లోని మైదానంలో దిగింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు ట్రైనీ పైలట్లు ఉన్నారు. వారిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన ఇద్దరు పైలట్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు గయ ఎస్ఎస్పీ ఆశిష్ భారతి తెలిపారు.