ఎమ్మెల్యే చొరవతో చనిపోయిన వ్యక్తిని ఇండియాకు రప్పించుటకు ఏర్పాట్లు

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మోపాల మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన శ్రీ చెన్నూరి బాల్ రాజ్ గారు బ్రతుకు తెరువు కోసం బహరేన్ దేశానికి వెళ్లి ప్రమాదవశాత్తూ చనిపోవడం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి గారి దృష్టికి 22-6-24 శనివారం నాడు తెచ్చారు. వెంటనే ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి తో మాట్లాడి ప్రభుత్వ ఖర్చుతో మృతదేహాన్ని ఇండియాకు తేవటానికి ఏర్పాట్లు చేయించారని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సిబ్బంది తెలిపారు. తేది 29-6-24 శనివారం రోజున మధ్యాహ్నం 12.00 గంటలకు మృతదేహం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. అంతే కాక మృతదేహాన్ని సోంత గ్రామానికి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించారని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సిబ్బంది తెలియజేశారు.
Spread the love