– లెప్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది
న్యూఢిల్లీ : నూతన ఆర్మీ వైస్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ద్వివేది నార్తర్న్ ఆర్మీ కమాండర్గా విధులు నిర్వహించారు. లెఫ్టినెంట్ జనరల్ ఎంవి.సుచీంద్ర కుమార్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ప్రస్తుతం ఎంవి సుచీంద్ర కుమార్ ఉదంపూర్ ఆధారిత నార్తర్న్ కమాండింగ్ జనరల్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే మే 31న పదవీ విరమణ అనంతరం ఆయన స్థానంలో ద్వివేది నియమితులు కావాల్సి ఉంది.