
– హర్షం వ్యక్తం చేసిన కలెక్టర్ ప్రియాంక అల
నవతెలంగాణ – అశ్వారావుపేట: కొండకోనల్లో నివసించే కొండ రెడ్లకు ఓటు హక్కు కల్పన కు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. గురువారం హైదరాబాద్ లోని టెక్ మహీంద్రా లెర్నింగ్ కేంద్రంలో ఓటు హక్కు నమోదు, ఓటు హక్కు వినియోగం తదితర అంశాలపై విద్యార్థులకు జిల్లాలలో వివిధ అంశాలపై నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలు కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండ రెడ్ల కు ఓటు హక్కు కల్పన కు జిల్లాలో చేపట్టిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు వల్ల 692 మంది ఓటు హక్కు పొందారని చెప్పారు.మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఓటు హక్కు కల్పన కు ఎన్నికల సంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం పంచాయితీకి చెందిన కొండ రెడ్లు ప్రదర్శించిన గిరిజన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవడం పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల హర్షం వ్యక్తం చేశారు.