ములుగు ఎంపిడీవోపై దాడికి యత్నం

నవతెలంగాణ – ములుగు: జిల్లాలో ఎంపిడీవోపై దాడి చేసేందుకు ఆరుగురు వ్యక్తులు యత్నించారు. స్కూటీపై వెళుతున్న తనను కారులో వెంబడించినట్లు పోలీసులకు ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. ఇంకుడు గుంతల ఎంబీని విలేజ్ సెక్రటరీ రికార్డు చేయలేదని, ఆ కోపంతో తనపై దాడికి యత్నించారని పోలీసులకు ఎంపీడీవో శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. అందులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవల అధికారులపై అధికారపార్టీకి చెందిన వారు దాడులు చేస్తున్నారు. వాళ్ళ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు ఇటీవల రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్యను జనగామ జిల్లాలో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పీఛైర్‌పర్సన్ భర్త కూడా ఉన్నాడు. ఉద్యోగులపై దాడులకు పాల్పడడం స్థానికంగా కలకలం రేగుతోంది.

Spread the love