చిరుధాన్యాలపై అవగాహన

నవతెలంగాణ – బొమ్మలరామారం

మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ బీబీనగర్ ఎమ్స్ వారు  మిల్లెట్స్ ప్రమోషన్ కమిటీ ఆధ్వర్యంలో చిరుధాన్యాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.గర్భిణీలు,బాలింతలు, రక్తహీనత కలిగిన మహిళలకు చిరుధాన్యాలతోనే ఆరోగ్యంగా ఉంటారని వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు.అనంతరం చిరుధాన్యాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్, ఎంపీడీవో సరిత, ఆర్ హెచ్ టి సి ఇన్చార్జి డాక్టర్ గోవింద్ రాజ్, సందీప్, విజయ్,విష్కన జైన్,సందీప్ ధోలే, నబ్రిత, వైద్య సిబ్బంది ,అంగన్వాడి సిబ్బంది ,ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
Spread the love