నవీపేట్ లో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

నవతెలంగాణ నవీపేట్: మండల కేంద్రంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై ర్యాలీ నిర్వహించి గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లింక్ వర్కర్ రవి మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రవీందర్ నాయక్, కో ఆప్షన్ నెంబర్ ముస్తాక్, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love