నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
మనువాద కార్పొరేట్ పాలకుల గుప్పిట్లో క్రీడారంగం ఉందని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.జ్యోతి అన్నారు. రెజ్లర్లపై లైంగికదా డులకు పాల్పడిన బీజేపీ ఎంపీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు.. క్రీడారంగ చరిత్ర లోనే ఇంత పెద్ద ఎత్తున ఒక పార్ల మెంట్ సభ్యునికి వ్యతిరేకంగా క్రీడాకారులు ఆందోళనకు దిగడం మొదటిసారి అన్నారు. వీరు మొదటిసారి జనవరిలో బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాల డిమాండ్తో ధర్నా చేశారని గుర్తు చేశారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకో లేదన్నారు. దీంతో మళ్లీ వారు ఆందోళన బాట పట్టారని అ న్నారు. రెజ్లర్ల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు. మోడీ నిమ్మకునీరెత్తనట్టు వ్యవహరిం చడం సరికాదన్నారు. రెజ్లర్లపై పోలీసులతో దాడి చేయిం చడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.