Monday, May 11, 2026
E-PAPER
Homeఆటలుబంగ్లాకు స్వల్ప ఆధిక్యం

బంగ్లాకు స్వల్ప ఆధిక్యం

- Advertisement -

పాకిస్తాన్‌‌తో తొలి టెస్టు
మీర్పూర్‌ : పాకిస్తాన్‌‌తో తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ ‌స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. నజ్ముల్‌ ‌హొస్సేన్‌ ‌శాంటో (101), మోమినుల్‌ ‌హాక్‌ (91), ముష్ఫీకర్‌ ‌రహీమ్‌ (71) ‌రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌‌లో బంగ్లాదేశ్‌ 413 పరుగుల భారీ స్కోరు చేసింది. పాకిస్తాన్‌ ఓపెనర్‌ అజాన్‌ (103), అబ్దుల్లా ఫజల్‌ (60), సల్మాన్‌ ఆగా (58), మహ్మద్‌ ‌రిజ్వాన్‌ (59) ‌రాణించటంతో పాకిస్తాన్‌ ‌తొలి ఇన్నింగ్స్‌‌లో 386/10 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 27 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. బంగ్లాదేశ్‌ ‌స్పిన్నర్‌ ‌మెహిది హసన్‌ ‌మిరాజ్‌ (5/102) ఐదు వికెట్ల ప్రదర్శనతో మాయ చేశాడు. మూడో రోజు ఆట ముగిసేసమయానికి బంగ్లాదేశ్‌ ‌రెండో ఇన్నింగ్స్‌‌లో 7/0తో ఆడుతోంది. ప్రస్తుతం ఆ జట్టు ఆధిక్యం 34 పరుగులు. బ్యాటింగ్‌‌కు అనుకూలిస్తున్న పిచ్‌‌పై చివరి రెండు రోజుల్లో ఫలితం రావటం అనుమానమే!.

ఉర్విల్‌ ‌రికార్డు
ఐపీఎల్‌‌లో వేగవంతమైన అర్థ సెంచరీ రికార్డును ఉర్విల్‌ ‌పటేల్‌ ‌సమం చేశాడు. 2023 ఐపీఎల్‌‌లో కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌పై యశస్వి జైస్వాల్‌(‌రాజస్తాన్‌ ‌రాయల్స్‌) అజేయంగా 98 పరుగులు చేయగా.. 13 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. తాజాగా ఉర్విల్‌ ‌పటేల్‌ ‌సూపర్‌‌జెయింట్స్‌‌పై ఏడు సిక్స్‌‌లు, ఓ ఫోర్‌‌తో 13 బంతుల్లోనే ఫిఫ్టీ అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌‌లో నేపాల్‌ ఆటగాడు దీపేందర్‌ ‌సింగ్‌ 9 ‌బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. దేశవాళీలో ఆశుతోషు శర్మ 2023-24లో అరుణాచల్‌ ‌ప్రదేశ్‌‌పై 11 బంతుల్లో అర్థ సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. యువరాజ్‌ ‌సింగ్‌, క్రిస్‌ ‌గేల్‌, హజ్రతుల్లా జజాయ్‌, సాహిల్‌ ‌చౌహాన్‌, అభిషేక్‌ ‌శర్మలు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌‌లో 12 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన జాబితాలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -