మండల వాసులకు ఉత్తమ జాతీయ పురస్కారాలు ..

నవతెలంగాణ – బెజ్జంకి
పలువురు మండల వాసులు బహుజన సాహిత్య అకాడమి అధ్వర్యంలో అందజేసే ఉత్తమ జాతీయ పురస్కారాలు వరించాయి. మండల కేంద్రానికి చెందిన హైకోర్ట్ న్యాయవాది, న్యాయ కళశాల ప్రధానాచార్యులు ఎలుక రవీంద్ర ప్రసాద్( విద్యారత్న),రామంచ రవీందర్( ఉత్తమ ఉపాధ్యాయ), ముత్తన్నపేట గ్రామానికి చెందిన బొర్ర సురేశ్(డాక్టర్ బీఆర్ అంబేడ్కర్)ఉత్తమ జాతీయ పురస్కారాలను అదివారం అంద్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నిర్వహించిన దక్షిణ భారత బహుజన రచయితల సమావేశంలో బహుజన సాహిత్య అకాడమి నల్లా రాధాకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా పురస్కారాలు అందుకున్న వారిని బహుజన సాహిత్య అకాడమి సభ్యులు శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు.ఉత్తమ జాతీయ పురస్కారాలు అందుకున్న మండల వాసులను పలువురు ఉపాధ్యాయులు, న్యాయవాదులు,స్వేరోస్ నెట్ వర్క్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
Spread the love