అంగరంగ వైభవంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి షష్టిపూర్తి జన్మదిన వేడుకలు సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఇందల్ వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద కేక్ కట్ చేసి,డిచ్ పల్లి మండలంలోని ధర్మారం(బి) గ్రామ శివారులోని పీహెచ్ఎర్ కన్వెన్షన్లో ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి దంపతులు భారీ కేకున్ను కట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేను పూలమాలలు, పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో కాంగ్రెస్ నాయకులు తాహెర్బిన్ హందాన్, శేఖర్ గౌడ్, ముప్ప గంగారెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, గడిల రాములు, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, అమృతాపూర్ గంగాదర్, మోత్కురి నవీన్ గౌడ్, పొలసాని శ్రీనివాస్, డెలిగేట్ సుధాకర్, సంతోష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఆశిష్,కర్స మేహన్, ఎల్ఐసి గంగాధర్, డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్,కంచెట్టి గంగాదర్, డాక్టర్ షాదుల్లా, దర్మాగౌడ్, వాసు బాబు, శ్యాంసన్, నవీన్రెడ్డి, సోసైటి చైర్మన్ తారాచంద్ నాయక్, మోతిలాల్, హబిబ్,జమీల్ పాషా, రాములు నాయక్, అయా మండలాల పార్టీ అధ్యక్షులు, సొసైటీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, జీజీహెచ్ సూపరిండెంట్ ప్రతిమారాజ్, డీఆర్డీవో చందర్ నాయక్, ఏడీఏ ప్రదీప్ కుమార్, ఏవో రాంబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు డిచ్ పల్లి మండల కేంద్రంలోని శ్రీకాశీ విశ్వనాధ ఆలయంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాహదరి వేంట ఫ్లెక్సీ లతో శుభాకాంక్షలు తెలిపారు.
రూ.3 కోట్ల 26 లక్షల రూపాయల పంపిణీ: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి జన్మదిన సందర్భంగా సిరికొండ మండల మహిళా సమాఖ్య సబ్యులకు బ్యాంకు లో ద్వారా మంజురైన రూ.3 కోట్ల 26లక్షల రూపాయల చేక్కును సోమవారం అందజేశారు.
Spread the love