సేవ చేసే నాయకుడిని ఆశీర్వదించండి : చీఫ్‌విప్‌ దాస్యం

నవతెలంగాణ-హన్మకొండ
ప్రజలకు సేవచేసే నాయకుడిని ఆశీర్వదించి ఎన్నుకోవాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వరంగల్‌ పశ్చిమ బి ఆర్‌ఎస్‌ అభ్యర్థి దాస్యం వినరుభాస్కర్‌ కోరారు. శని వారం హనుమకొండ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాల యంలో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మెరు కుల వెల్ఫేర్‌ అసోసియేషన్‌, శ్రీ భద్రకాళి మెరు కుల మహిళ పొదుపు మరియు పరపతి సంఘం ఆత్మీ య సమ్మేళనాన్ని అధ్యక్షుడు పొడిశెట్టి అనిల్‌ కుమార్‌ సభాధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా హాజరైన దాస్యం వినరు భాస్కర్‌ మాట్లా డుతూ కెసిఆర్‌ భరోసానే బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుందన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవే శపెట్టి అమలు చే స్తున్నటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. ఇటీవల హనుమ కొండకు విచ్చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ మెజారిటీ ఖాయం, గతంలో కంటే 50,000 పైచీలకు మెజార్టీతో గెలుస్తావని చెప్పారని తెలిపారు. ఇక్కడికి వచ్చినటు వంటి వారి ఉత్సాహం,పట్టుదల చూస్తుంటే అది ఖచ్చి తంగా నెరవేరుతుంది అన్నారు. ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మీరందరూ కూడా మీ బంధువులకు, మీ పక్క వారికి, అందరికీ కూడా అభివద్ధి పథకాల గురిం చి తెలియపరుస్తూ, ప్రతి ఒక్కరిచే ఓటు వేయించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా మీరు కులస్తులందరూ దాస్యం వినరు భాస్కర్‌ కు ఓటు వేస్తామని,అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కార్యక్రమంలో కాకతీయ పట్టణాభివద్ధి సంస్థ చైర్మన్‌ సుందర్‌ రాజు యాదవ్‌,వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్‌ జనార్దన్‌ గౌడ్‌, కార్పొరేటర్‌ రంజిత్‌ రావు, మేరు కుల సంఘం నాయకులు వెంకట్రాజం, రామగిరి రాజు,కీర్తి జయంత్‌,సంతోష్‌, ప్రభాకర్‌,రాకేష్‌, సాయి లత, అరుణ,బుర్ర శ్రీనివాస్‌,వెంకటేష్‌, పుప్పల ప్రభాకర్‌, చంద్రశేఖర్‌ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love