Tuesday, August 11, 2026
E-PAPER
Homeక్రైమ్గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
శనివారం మధ్యాహ్నం దేవునిపల్లి పెద్ద చెరువులో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి యొక్క మృతదేహం గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తి రెండు లేదా మూడు రోజుల క్రితం ఇతను మరణించి ఉంటాడని దేవునిపల్లి ఎస్సై అంచనా వేశారు. మృతుడి వయస్సు దాదాపుగా  25 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉంటుందని అన్నారు. మృతుడి కుడి చేయిపై, రాం అని తెలుగులో వ్రాసి ఉందనీ, తెలిసిన వారు ఎవరైనా తప్పిపోయి ఉంటే.. ఈ ఫోటోతో పోల్చి చూసి, ఇతనికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉంటే తెలియజేయగలరని దేవునిపల్లి ఎస్సై ఆ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -