Friday, May 15, 2026
E-PAPER
Homeజిల్లాలుపుస్తక ప్రదర్శన…అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రారంభం

పుస్తక ప్రదర్శన…అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక,విద్యా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం చౌటుప్పల్ పట్టణంలో పుస్తక ప్రదర్శన ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడారు.పుస్తకాలు జ్ఞానానికి నిధులని, పుస్తక ప్రదర్శనలు ప్రతి ఒక్కరి జీవితాల్లో సానుకూల మార్పు తెస్తాయని ఆయన అన్నారు.విద్యార్థులు,యువత పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ చౌటుప్పల్ ఆర్డీఓ వెల్మ శేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్‌తో పాటు పలువురు అధికారులు,విద్యార్థులు,స్థానికులు పాల్గొన్నారు.ప్రదర్శనలో వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలను ఏర్పాటు చేయగా సందర్శకులు ఆసక్తిగా తిలకించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -