ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం..

– తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్ర సమితి అంటే  తెలంగాణ ప్రజా దళం,గళం,బలం అని స్థానిక మాజీ ఎమ్మెల్యే మెచ్చా  నాగేశ్వరరావు అన్నారు. భారత రాష్ట్ర సమితి 23 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని మూడు రోడ్ల ప్రధాన కూడలి లో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ముందుగా అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏకైక పార్టీ తెరాస మాత్రమేనని,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వములో రాష్ట్రం ఏర్పాటు చేసుకొని,ఆయన పరిపాలనలో 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాడు అని హర్షం వ్యక్తం చేసారు.తెలంగాణ రాష్ట్రం కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా నిలబడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. అనంతం పేరాయిగూడెం లో కార్యకర్త గృహంలో జరిగే వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపి పీ జల్లి పల్లి శ్రీరామమూర్తి,వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర,జెడ్పీటీసీ మాజీ సభ్యులు,జే కే వీ రమణారావు,మాజీ వైస్ ఎంపీపీ మందపాటి రాజమోహన్ రెడ్డి, అంకత మల్లికార్జున్ రావు,మల్లాయిగూడెం మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి యుఎస్ ప్రకాష్,వగ్గెల పూజ,టౌన్ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ,మోహన్ రెడ్డి,సంక ప్రసాద్,తాడేపల్లి రవి,కాసాని చంద్ర మోహన్, గుడవర్తి వెంకటేశ్వరరావు,చిప్పనపల్లి బజారయ్య,చిప్పనపల్లి శ్రీను,యువ నాయకులు మోటూరి మోహన్,సోమాని రమేష్,తగరం హారి,రఘ్ రాం,చరణ్,తదితరులు పాల్గొన్నారు.
Spread the love