- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కేటీఆర్, హరీష్ రావు, శాసనసభ, మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కీలక నేతలు పాల్గొంటారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, పార్టీ ఇన్చార్జిల నియామకం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. లంచ్ అనంతరం ఈ సమావేశం ప్రారంభం కానుంది.
- Advertisement -



