నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖతమైందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్లో గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం 11 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు ఆఫీస్ లేదని పేర్కొన్నారు. కొకాపేటలో బీఆర్ఎస్కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ భూమిని వేలమేసి వచ్చిన డబ్బును రుణమాఫీకి వాడాలని సూచించారు.