కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ..

– ప్రమాద భీమా చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి జెడ్పీఛైర్మన్ పుట్ట మధూకర్ 
నవతెలంగాణ – మల్హర్ రావు
కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంఛార్జి,పెద్దపల్లి జెడ్పి ఛైర్మన్ పుట్ట మదుకర్ అన్నారు. కాటారం మండలంలోని దామెరకుంట గ్రామానికి చెందిన బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్త కనుకుట్ల సమ్మయ్య, మహముత్తారం మండలంలోని బోర్లగూడెం గ్రామానికి చెందిన గండ్ర కిషన్ రావు లు ప్రమాదంలో మరణించగ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మంజూరైన చెక్కులను భీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి  రూ.2 లక్షల చెక్కులను బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు.
Spread the love