మంత్రి వేములకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శ

– మంజులమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ- కంటేశ్వర్
రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ  ఇటీవల మృతి చెందగా మంగళవారం నాడు ఆయన్ను నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లోని వారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మున్సిపల్,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంజులమ్మ చిత్ర పటానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రి వేములను,వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love