బీఆర్‌ఎస్‌వి స్కీములు.. బీజేపీవి స్కామ్‌లు

– దేశం చూపు కేసీఆర్‌ వైపు…
– 26న కాందార్‌ లోహ సభ సూపర్‌ సక్సెస్‌ కావడం ఖాయం
– పీయూసీ చైర్మెన్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజల కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ స్కీములను అమలు చేస్తుంటే, తమ దోస్తుల కోసం బీజేపీ స్కాములను చేస్తున్నదని పీయూసీ చైర్మెన్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి విమర్శించారు. గురువారం కాందార్‌ లోహలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మోడల్‌ దేశానికే ఆదర్శమంటూ దేశ ప్రజలు కేసీఆర్‌ వైపు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ మాదిరిగా ప్రతి రాష్ట్రంలో భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, అన్ని వర్గాల ప్రజల కోసం పథకాలు, కార్యక్రమాలు అమలు చేయాల్సిన అవసరముందని తెలిపారు. 26న కాందార్‌ లోహలో జరిగే బహిరంగ సభలో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి భారీ చేరికలుంటాయనీ, మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించిందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే షకీల్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే శంకరన్న ధోండ్గే, బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారి తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love