- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
రోజురోజుకూ మండుతున్న ఎండల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో రైతులు, ఉపాధి హామీ కూలీలు, కార్మికులు అల్లాడుతున్నారు. ఈ నేపధ్యంలో మండలంలోని కొయ్యుర్ గ్రామంలో చెరువులు, కుంటల్లో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలకు గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ ఆధ్వర్యంలో బుధవారం మజ్జిక, ఓఆర్ఎస్ ప్యాకేట్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ, ఉపాధిహామీ సిబ్బంది, ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు.
- Advertisement -



