ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక

ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక– షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన 13 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) షెడ్యూల్‌ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్‌ నుంచి 4, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి 3, ఉత్తరఖండ్‌ నుంచి 2, బీహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ల్లో ఒక్కో స్థానానికి షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఈసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికలకు జూన్‌ 14న నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్టు తెలిపింది. జూన్‌ 21న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం, జూన్‌ 24కు నామినేషన్ల పరిశీలనకు గడువు ఉంటుందని తెలిపింది. జూన్‌ 26 నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదిగా వెల్లడించింది. జులై 10న 13 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Spread the love