పేపర్ కప్పులతో క్యాన్సర్.. సైంటిస్టుల వెల్లడి

నవ తెలంగాణ – జక్రాన్ పల్లి 
లండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో నూటికి నూరు మంది సైంటిస్ట్ లు చెప్పిన నిజమిది. ఇండియాలో చదువుకున్న వాళ్లు కూడా కాగితం కప్పులల్లో టీలు, కూల్ డ్రింక్ లు తాగుతూ క్యాన్సర్ ని కొనుక్కుంటున్నారు. గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని బాధపడ్డారు. ఎయిడ్స్ నివారణ కోసం కండోమ్ లు పంచిన ప్రభుత్వం, క్యాన్సర్ నివారణచేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని బాధపడ్డారు.
మీరు ఎప్పుడైనా కాగితం తయారు చేసే ఫ్యాక్టరీ కి వెళ్ళరా? ఒకసారి వెళ్లి చూడండి. జీవితంలో మీరు కాగితం కప్పులో టీ తాగరు. కాగితం తయారు చేయడానికి మురికి కాలువలో ప్రవహించే నీళ్ళు వాడతారు అని తెలుసా? వాటర్ ట్యాంక్ నాచుతో, కంపు వాసనతో ఉంటుంది. దాని నిండా పురుగులే. చనిపోయిన ఎముకలు తేలుతాయి. రా మేటిరియల్ని కుల్లబెడతారు. కాళ్ళతో తొక్కి మెత్తగా చేస్తారు. దాదాపు 15 రకాల కెమికల్స్ వాడుతారు. అందులో ఆసిడ్ లాంటి విషపూరిత కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. కాగితం కప్పు మెత్తబడుకుండా, ప్లాస్టిక్ తో చేసిన ఫెవికాల్ లాంటి కెమికల్ గమ్ కూడా వాడతారు. వేడి టీ కాగితం కప్పులో వేయగానే వచ్చి టీలో కలుస్తాయి. మనం అలాగే తాగేస్తున్నాం. క్యాన్సర్ని కొని తెచ్చుకుంటున్నాము.కావున ఆలోచించండి, ఆరోగ్యమా లేక క్యాన్సర్ తెచ్చుకోవడమా అది మన చేతిలో ఉంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్య రక్షణ కూడా అవసరం. కావున ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలసిన అవసరం ఉంది.
Spread the love