- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి: మండల పరిధిలోని వడ్లూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ఎస్ఐ తిరుపతి ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ,పంచాయతీ పాలక వర్గం సభ్యులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.సీపీ రష్మీ పెరుమాళ్ చేపట్టిన సురక్ష నేత్రలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి గ్రామ రక్షణకు తోడ్పాటును అందించడం సంతోకరమని.. మండలంలోని ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణకు సహాయసహకారాలందించాలని ఎస్ఐ కోరారు.స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంకాలి అనిల్,పలువురు గ్రామస్తులు ఎస్ఐ తిరుపతిని శాలువతో సన్మానించారు.అనంతరం తోటపల్లి గ్రామంలో సీసీ కెమెరాలను ఎస్ఐ ప్రారంభించారు. సర్పంచులు పులి రమేశ్,జుట్టు ఆశ్విని,వార్డు సభ్యులు,అయా గ్రామాల గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



