- Advertisement -
-తల్లిపాల వారోత్సవాల్లో సర్పంచులు శ్రీధర్, మానస
నవతెలంగాణ-బెజ్జంకి
శిశువులకు తల్లిపాలు శ్రేప్టమైనవని సర్పంచులు బొ బొల్లం శ్రీధర్,బైరి మానస సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పాపయ్యపల్లి, దాచారం గ్రామాల అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచులు శ్రీధర్, మానస హజరై పౌష్టికాహారం, యూనిఫామ్స్ పంపిణి చేశారు. వార్డు సభ్యులు, సూపర్ వైజర్లు నాగారాణి, భవాని, అంగన్వాడీల ఉపాధ్యాయులు, నాయకులు బైర సంతోశ్ పాల్గొన్నారు.
- Advertisement -



