చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో ఖైదీలకు చికెన్, మటన్ బంద్

నవతెలంగాణ – హైదరాబాద్
చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో నిధులకు కటకట ఏర్పడటంతో ఖైదీలకు మాంసాహారం సరఫరా నిలిచిపోయింది. మహిళా కారాగారంలోనూ ఖైదీలకు రెండు వారాలుగా చికెన్, మటన్ ఇవ్వట్లేదు. మాంసాహారం సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు సుమారు రూ. 2 కోట్ల వరకూ బకాయి ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ విడుదల కాకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలిసింది. ఖైదీలకు మొదటి ఆదివారం మటన్,..మిగిలిన ఆదివారాలు చికెన్ వడ్డిస్తారు. ఇదిలా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో పాలు, రేషన్, గ్యాస్ సరఫరాలో కూడా సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది.

Spread the love