- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహాలక్ష్మి పథకంలో మార్పులు రానున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఆధార్ కార్డు పనిచేయదు. దీనికి ప్రత్యామ్నాయంగా మహిళలందరికీ స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనుంది తెలంగాణ ఆర్టీసీ. లబ్ధిదారుల పేర్లు, అడ్రస్, ఐడీ నెంబర్లతో చిప్ బేస్డ్ టెక్నాలజీతో తయారు చేసిన స్మార్ట్ కార్డులను అందించనుంది. దీని ప్రకారం ఇకపై స్మార్ట్ కార్డు ఉంటేనే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. ఈ స్మార్ట్ కార్డులు అందేంత వరకు పాత పద్ధతిలోనే మహిళలు ప్రయాణించవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
- Advertisement -



