- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్లో భారత ‘ఏ’ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. గాయపడిన యువ పేసర్ యుధ్వీర్ సింగ్ స్థానంలో అశోక్ శర్మ ఎంపికయ్యాడు. గత వారం కుడి భుజం అసౌకర్యం కారణంగా యుధ్వీర్ సింగ్ వైదొలగడంతో, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిహాబిలిటేషన్ కోసం వెళ్లారు. అశోక్ శర్మ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీయడంతో పాటు, ఐపీఎల్ 19వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతూ గంటకు 154.2 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి వార్తల్లో నిలిచాడు. ఈ మార్పుపై బీసీసీఐ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
- Advertisement -



