- Advertisement -
హెచ్పిఆర్సి
ఈక్వెస్ట్రియన్ చాలెంజ్
నవతెలంగాణ-
హైదరాబాద్ :
2వ హెచ్పిఆర్సి ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ పోటీల్లో అనన్య గుప్తా విజేతగా నిలిచింది. అండర్-14 విభాగం షో జంపింగ్ (60 సెమీ)లో అనన్య గుప్తా పసిడి సాధించగా, మోక్ష్, అమృత, వివాన్లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఓపెన్ షో జంపింగ్ (60 సెమీ) విభాగంలో సంయుక్త లక్ష్మి విజేతగా నిలువగా.. అబ్దుల్ మానన్, గౌతం సంజయ్ మెడల్స్ సాధించారు. షో జంపింగ్ ఓపెన్ (80 సెమీ)లో మహ్మద్ హషమ్, అర్నవ్, వివాన్, అబ్దుల్ మానన్లు టాప్-4లో నిలిచారు. హెచ్పిఆర్సి ప్రెసిడెంట్ చైతన్య కుమార్ విజేతలకు పతకాలు, ప్రైజ్మనీ అందజేశారు.
- Advertisement -



