పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని బషీరాబాద్ గ్రామ మాజీ సర్పంచ్ సక్కారం అశోక్ అన్నారు. శుక్రవారం మండలంలోని బషీరాబాద్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సక్కారం అశోక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.గంగాధర్ లతో తెలిసి బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పిస్తుందని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కోరారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  విద్యార్థులు సాధించిన ఉత్తమ ఫలితాలతో ముద్రించిన కరపత్రాలను ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రమౌళి, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ గౌడ్, నాయకులు ఎన్.రమేష్, సక్కారం నారాయణ, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love