సిరిసిల్ల భాధ్యతలు స్వీకరించిన సిఐ రఘుపతి

నవతెలంగాణ –  సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సీఐగా బోడకుంట రఘుపతి బుధవారం భాధ్యతలు స్వీకరించారు. 2004 బ్యాచ్ కు చెందిన రఘుపతి హనుమకొండ జిల్లా వాస్తవ్యుడు. 2006 నుంచి 2009 వరకు ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. 2009 నుంచి 2010 వరకు మంచిర్యాల ఎస్ఐగా, 2010 నుంచి 2011 వరకు బైంసా రూరల్ ఎస్సైగా, 2012 నుంచి 2013 వరకు ముధోల్ ఎస్సైగా  ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. సీఐగా పదోన్నతి రావడంతో కరీంనగర్ సీఐడి విభాగంలో 2013 నుంచి 2015 వరకు పని చేశారు. ముధోలు సీఐగా 2017 నుంచి 2018 వరకు ఇంటలిజెన్స్ సీఐ గా, 2018 నుంచి 2022 వరకు ఆదిలాబాద్ రూరల్ సీఐగా , 2022 నుంచి 2023 జూలై వరకు సిరిసిల్ల డి సి ఆర్ బి సి ఐ గా, 2023 జూలై నుంచి  2024 జనవరి 16 వరకు రఘుపతి పని చేశారు. ఈనెల 17న సిరిసిల్ల పట్టణ సిఐగా బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు.

Spread the love