మల్లాపూర్ లో కరెంటు స్తంభాల బిగింపు…

– సహకరించిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కృతజ్ఞతలు..
నవతెలంగాణ-డిచ్ పల్లి
మల్లాపూర్ గ్రామంలో కరెంటు స్తంభాల విషయమై ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ,ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు రఘునాథన్ రాము ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవన్న కు స్మశాన వాటిక వద్ద, గ్రామంలోని ఇతర కారులోని లలో విద్యుత్ స్తంభాలు అత్యవసర మని వివరించగా లక్ష యాభై వేల రూపాయలు మంజూరు చేయడం తో గ్రామంలో బుధవారం అక్కడక్కడ స్తంభాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్మశాన వాటిక వద్ద 15 హెచ్పి ట్రాన్స్ఫార్మర్ కూడా మంజూరు చేశారని దానికి గాను గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.

Spread the love