నవతెలంగాణ – పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మంగళవారంనాడు సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వాతావరణం సరిగా లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి సురక్షితంగా బయటపడ్డారని టీఎంసీ నేత రజిబ్ బెనర్జీ ఒక ట్వీట్లో తెలియజేశారు. ”జల్పాయ్గురి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మమతా బెనర్జీ ప్రసంగం పూర్తి చేసుకుని హెలికాప్టర్లో బాగ్డోగ్రా బయలుదేరారు. బైకుంఠపూర్ అటవీ ప్రాంతం మీదుగా వెళ్తుండగా వాతావరణ ప్రతికూలత ఎదురైంది. వర్షాలు, లో-విజిబిలిటీ కారణంగా సెవోక్ ఎయిర్ బేస్లో హెలికాప్టర్ను దించాలని పైలట్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం సురక్షితంగా ఉన్నారు” అని రజిజ్ బెనర్జీ తెలిపారు.