బెంగాల్ లో యువకుడి వినూత్న నిరసన..22 కిలోమీటర్లు పరిగెత్తికెళ్లి.!

నవతెలంగాణ – పశ్చిమ బెంగాల్
తన గ్రామంలో అభివృద్ధి లేక విసిగిపోయిన ఓ వ్యక్తి వినూత్న శైలిలో నిరసన తెలిపాడు. దాదాపు 22 కిలీమీటర్ల దూరం పరిగెత్తికెళ్లి పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశాడు. బెంగాల్‌లోని దార్జీలింగ్ జిల్లా సొనాడ గ్రామంలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.  కొండ ప్రాంతంలో ఉన్న తమ ఊరిని ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోవడం లేదని స్థానిక యువకుడు సనారా సుబ్బా ఆవేదన వ్యక్తం చేశాడు. ఏళ్లు గడుస్తున్నా తమ సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో తానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.

Spread the love