హైదరాబాద్‌లో మూడో రోజూ కొనసాగుతున్న ఐటీ సోదాలు

నవతెలంగాణ – హైదరాబాద్‌: నగరంలో మూడో రోజూ ఆదాయపు పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. వైష్ణవి గ్రూప్‌ స్థిరాస్తి సంస్థ, హోటల్‌ ఎట్‌ హోమ్‌, వాటి అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లు, సీఈవోలు, డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు కొనసాగించారు. పన్ను చెల్లింపులకు సంబంధించిన వివిధ పత్రాలను పరిశీలిస్తున్నారు. నగరంలో జరుగుతున్న ఈ సోదాల్లో సుమారు 70 ఐటీ బృందాలు పాల్గొన్నాయి.

Spread the love