![Cm-Revanth-Governar](https://navatelangana.com/wp-content/uploads/2024/02/Cm-Revanth-Governar.jpg)
ఆసియాలో అతి పెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళ సై సౌధర్యరాజన్ లు నేడు అనగా ఈ నెల 23న రానున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు., మేడారం జాతర బుధవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ జాతర ఈ నెల 24 వరకు కొనసాగుతోంది. రెండేళ్ళకొకసారి జరిగే ఈ జాతరకు రాష్ట్రం నుంచే గాకుండా వివిధ రాష్టాల నుండి లక్షలాది మంది భక్తులు వచ్చి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటున్నారు.