నవతెలంగాణ-హైదరాబాద్ : కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ప్రాంతాన్ని ప్రత్యేక జోన్గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం.. గీసుకొండ మండలం శాయంపేటలోని మెగా టెక్స్టైల్ పార్క్ను సందర్శించారు. వన మహోత్సవంలో భాగంగా మెగా టెక్స్టైల్ పార్క్లో మొక్కలు నాటారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనంతరం పార్క్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. టెక్స్టైల్ పార్కుకు భూములిచ్చిన వారికి తొలుత ఇళ్ల స్థలాలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ప్లాట్లతో పాటు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే సాధ్యాసాధ్యాలపై పరిశీలించాలని అధికారులను సీఎం అదేశించారు. 1,200కు పైగా ఇళ్లను నిర్మిస్తే గ్రామ పంచాయతీగా డిక్లేర్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. టెక్స్టైల్ పార్కు సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. కైటెక్స్, యంగ్ వన్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. మెగా టెక్స్టైల్ పార్కుకు సమీపంలో వరద నీటిని స్టోర్ చేసేలా పది ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో చెరువును ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. టెక్స్టైల్ పార్కుకు సమీపంలో వచ్చే వరద నీటిని ఈ చెరువులోకి మళ్లించి వాటిని స్టోర్ చేయాలని సూచించారు. ఈ చెరువును స్థానికంగా ఉండే ఇతర చెరువులతో లింక్ చేయడం ద్వారా వరద నీటికి పరిష్కారంతో పాటు టెక్స్టైల్ పార్క్కు అవసరమైన నీటి లభ్యతను సాధించే అవకాశం ఉంటుందని చెప్పారు.