- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గోదావరి, కృష్ణా బేసిన్లలోని పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్లు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అంతరాష్ట్ర జల వివాదాలపై కేంద్ర పెద్దలతో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఫ్యూచర్ సిటీ మెట్రో లైన్ల ప్రతిపాదనలపై కూడా చర్చించనున్నారు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీపై AICC పెద్దలతో కూడా సీఎం చర్చించే అవకాశం ఉంది.
- Advertisement -



