నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 109 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను.. లక్కారంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెంకటయ్య మునుగోడు ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్ హాజరయ్యారు.వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నర్సింహగౌడ్ మండల అధ్యక్షులు బోయ దేవేందర్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు మొగుదాల రమేష్ గౌడ్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ కౌన్సిలర్లు,కోఆప్షన్ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు
109 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



