జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో కుప్పకూలిన పాండల్

నవతెలంగాణ – ఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ప్రమాదం చోటు చేసుకుంది. స్టేడియంలోని గేట్‌ నంబర్‌ 2 సమీపంలో ఓ వివాహ వేడుక కోసం ఏర్పాటు చేస్తున్న వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ఎయిమ్స్‌ ట్రామా ఆసుపత్రికి తరలించారు. ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుమారు 10 నుంచి 12 మంది అక్కడ చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Spread the love