స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. శనివారం సాయంత్రం నల్లగొండ పార్లమెంట్ సంబంధించిన సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్, జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ హెగ్డే తో కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ఫైర్ అలారమ్స్ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈసీఐ నిబంధన ప్రకారం ఈవీఎం స్ట్రాంగ్ రూములను పట్టిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డిఓ మధుసూదన్, తాసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, డిఎం మార్కెటింగ్ శర్మ, అధికారుల సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love