ధాన్యం కొనుగోలులో పూర్తి..

నవతెలంగాణ-భిక్కనూర్ : మండలంలోని పెద్ద మల్లారెడ్డి సొసైటీ పరిధిలో 100% దాన్యం కొనుగోలు చేయడం పూర్తయిందని సొసైటీ చైర్మన్ రాజా గౌడ్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లారీలను, హమాలీలను ఏర్పాటు చేసి 60 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, త్వరలోనే రైతులకు ధాన్యం డబ్బులు ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.

Spread the love