కేసీఆర్ పాలనలో గ్రామాల సమగ్రాభివృద్ధి

– హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్ 
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో గ్రామాల సమగ్ర అభివృద్ధి జరుగుతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్ గ్రామంలో రూ .16 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాధారణకు గురైన గ్రామాలు నేడు అభివృద్ధికి చిరునామాలుగా మారాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బత్తిని సాయిలు, మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love