- Advertisement -
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని బుధవారం మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంతారావు, హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి తెలుసుకొని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
- Advertisement -



