ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు శివ పంతులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణనాల మధ్య కళ్యాణోత్సవాన్ని    ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయం వద్ద అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి, ఉపాధ్యక్షులు శివసారం గణేష్, కోశాధికారి నూకల బుచ్చి మల్లయ్య, ప్రధాన కార్యదర్శి జైడి బాలకృష్ణ, సలహాదారులు కండక్టర్ రవీందర్, దూలూరి కిషన్ గౌడ్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love