ఎన్నికల వేళ కాంగ్రెస్ కు బిగ్ షాక్

నవతెలంగాణ – హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన సీనియర్‌ నేత తాజిందర్‌ సింగ్‌ బిట్టు ఏఐసీసీ కార్యదర్శి పదవికి, హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి పదవికి, కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు తన రాజీనామా లేఖను పంపించారు.

 

Spread the love