నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఖమ్మం నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఆధిక్యంలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఎలాంటి ప్రభావం చూపించలేకపోతున్నారు. ఖమ్మంలో 2,44,348 ఓట్ల ఆధిక్యంలో రఘురాం రెడ్డి ఉన్నారు.