ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ని కలిసిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
 ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా నియమింపబడ్డ నాగరిగారి ప్రీతం ని  హైదరాబాదులోని భువనగిరికి చెందిన యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ  నాయకులు కలిసి శాలువాతో  సత్కరించి, పుష్పగుచ్చం  అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రీతం మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందజేసి, ఎస్సీల అభివృద్ధికి   కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ భువనగిరి మండల అధ్యక్షులు కనుకుంట్ల కొండల్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి చేగూరి బాలు, మండల కార్యదర్శి లకావత్ సురేష్, నాయకులు కొండమడుగు శ్రీనివాస్, బోల్లేపల్లి తుకారం, బోయ శివ లు  పాల్గొన్నారు.
Spread the love